లోక్ అదాలత్ సెటిల్మెంట్తో బాధిత కుటుంబానికి రూ.42 లక్షల పరిహారం
లోక్ అదాలత్ సెటిల్మెంట్తో బాధిత కుటుంబానికి భారీ ఊరట
ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి రూ.42 లక్షల పరిహారం
నందిగామ, సెప్టెంబర్ 12: ఏళ్ల తరబడి కొనసాగిన న్యాయపోరాటానికి లోక్ అదాలత్ సెటిల్మెంట్తో తెరపడింది. 2019లో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శనగపాడు రమణ మృతి ఘటనకు సంబంధించి ఆయన కుటుంబానికి రూ.42 లక్షల పరిహారం అందింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ.42,00,000 చెక్కును అందజేశారు.
ఈ వ్యవహారంపై నందిగామ 16వ అదనపు జిల్లా కోర్టులో ఎం.వి.ఓ.పీ. నంబర్ 50/2019 కేసు విచారణ జరిగింది. లోక్ అదాలత్ సెటిల్మెంట్లో భాగంగా ఇరు పక్షాల కక్షిదారులు, న్యాయవాదుల సమక్షంలో నందిగామ 16వ అదనపు జిల్లా జడ్జి పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి పరిహారం చెక్కును అందించారు.
ఆర్టీసీ తరఫున న్యాయవాది చిరుమామిళ్ల శ్రీనివాసరావు ఈ వ్యవహారంలో సహకారం అందించారు. పరిహారం అందడంతో బాధిత కుటుంబ సభ్యులు న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్లుగా కొనసాగుతున్న కేసు పరిష్కారం కావడంతో కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట లభించినట్లయింది.
ఈ కార్యక్రమంలో నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, కార్యదర్శి చేరుకుమల్లి రామారావు, ఇరు పక్షాల న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.