అనారోగ్యానికి గురైన మంత్రి పార్థసారథిని పరామర్శించిన ఏలూరు ఎంపీ
ఆంధ్రప్రదేశ్
ఏలూరు: ఇటీవల అనారోగ్యానికి గురైన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా పార్థసారథి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎంపీ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని పుట్టా మహేశ్ కుమార్ కోరుకున్నారు. మంత్రి పార్థసారథి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను కూడా ఎంపీ అడిగి తెలుసుకున్నారు.