చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం
చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం
అన్నమయ్య జిల్లా | చిన్నమండెం మండలం | NTODAY NEWS
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరితమ్మ, కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధి ద్వారా రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.
చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల అధ్యక్షులు మూగి రెడ్డప్ప, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు, గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.