BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 14 September 2026, 05:27 pm
Posted by : BALAKRISHNA BANDI

రొంపిచర్లలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
14 Sep, 2026 - 05:27 PM
33 వీక్షణలు

దద్దాలవారిపల్లిలో భారీ వినాయక విగ్రహం.. భక్తిశ్రద్ధలతో పూజలు

రొంపిచర్ల | Ntoday News

చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మండలంలోని పలు గ్రామపంచాయతీల పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 

ముఖ్యంగా రొంపిచర్ల మండలంలోని బోడిపాటివారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దద్దాలవారిపల్లిలో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామస్తులు, యువత, పెద్దలు భక్తిశ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కోలాటాలు, భక్తి కార్యక్రమాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలు ఉత్సవాల్లో పాల్గొంటూ గణనాథుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు.

మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు పాటించాలని అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో, నిర్వాహకులు కూడా నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.