సీఎంఆర్ఎఫ్తో మరో కుటుంబానికి ఆర్థిక చేయూత.. రూ.22,114 చెక్కు అందజేత
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తూర్పు ఎడవల్లి గ్రామానికి చెందిన బుగ్గ మమతకు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.22,114 విలువైన చెక్కును చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని, ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
చెక్కు అందుకున్న బుగ్గ మమత కుటుంబ సభ్యులు ప్రభుత్వం, ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా అందిన ఈ ఆర్థిక సాయం తమకు ఎంతో ఊరటనిచ్చిందని వారు పేర్కొన్నారు.