BREAKING
​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి లక్సెట్టిపేటలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ విశాఖ గాజువాకలో కూలిన కన్స్ట్రక్షన్ పై ప్రమాదం పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష త్రాగు నీటి సరఫరా పై అధికారులతో సమీక్ష ముసునూరు శ్రీ వేంకటాచల స్వామి దేవస్థానం కుంభాభిషేకం అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం ఈనెల 27 న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం)..... జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ లింగపాలెం గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి లక్సెట్టిపేటలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ విశాఖ గాజువాకలో కూలిన కన్స్ట్రక్షన్ పై ప్రమాదం పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష త్రాగు నీటి సరఫరా పై అధికారులతో సమీక్ష ముసునూరు శ్రీ వేంకటాచల స్వామి దేవస్థానం కుంభాభిషేకం అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం ఈనెల 27 న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం)..... జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ లింగపాలెం గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
www.ntodaynews.com

​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
26 Apr, 2026 - 06:50 PM
10 వీక్షణలు

పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి

​వెల్గటూర్, ఏప్రిల్ 26:

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లి సరదాగా గడుపుదామనుకున్న ఓ బాలుడిని మృత్యువు బావి రూపంలో కబళించింది. ఈతకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన గొల్లపల్లి, బుగ్గరం మండలాల్లో కలకలం రేపింది.

​సంఘటన వివరాలిలా ఉన్నాయి..

​బుగ్గరం మండలం బీర్సని గ్రామానికి చెందిన కాంపెల్లి రితేష్ (13) అనే బాలుడు, ఆదివారం గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో జరుగుతున్న బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యాడు. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు రితేష్ సమీపంలోని వ్యవసాయ బావిలోకి ఈతకు వెళ్లాడు.

​అయితే, బావిలో నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక రితేష్ నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతి చెందాడు.

​గ్రామంలో మిన్నంటిన రోదనలు

​కళ్లముందే ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లి సంబరాల్లో ఉన్న బంధువుల ఇళ్లలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. బీర్సని గ్రామం రితేష్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నారు