BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
26 Apr, 2026 - 06:50 PM
111 వీక్షణలు

పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి

​వెల్గటూర్, ఏప్రిల్ 26:

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లి సరదాగా గడుపుదామనుకున్న ఓ బాలుడిని మృత్యువు బావి రూపంలో కబళించింది. ఈతకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన గొల్లపల్లి, బుగ్గరం మండలాల్లో కలకలం రేపింది.

​సంఘటన వివరాలిలా ఉన్నాయి..

​బుగ్గరం మండలం బీర్సని గ్రామానికి చెందిన కాంపెల్లి రితేష్ (13) అనే బాలుడు, ఆదివారం గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో జరుగుతున్న బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యాడు. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు రితేష్ సమీపంలోని వ్యవసాయ బావిలోకి ఈతకు వెళ్లాడు.

​అయితే, బావిలో నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక రితేష్ నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతి చెందాడు.

​గ్రామంలో మిన్నంటిన రోదనలు

​కళ్లముందే ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లి సంబరాల్లో ఉన్న బంధువుల ఇళ్లలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. బీర్సని గ్రామం రితేష్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నారు