www.ntodaynews.com
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
NTODAY NEWS :- వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని
చిలకలూరిపేట: చిలకలూరిపేట పట్టణ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ కార్యదర్శి షేక్ అబ్దుల్ భాషా వాలీమా వేడుకకు మాజీ మంత్రి విడదల రజిని హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు, బంధువులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.