గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో గోరింటాకు వేడుకలు
గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో గోరింటాకు వేడుకలు
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం గోరింటాకు సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మన సంప్రదాయాలు, వాటి వెనుక ఉన్న వైజ్ఞానిక విశేషాలను విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పాఠశాల డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు.
విద్యార్థినులు, ఈ సంబరాలలో ఉపాధ్యాయినులు ఉత్సాహంగా పాల్గొని విద్యార్థులకు సహజ సిద్ధమైన గోరింటాకును అలంకరిస్తూ ఆషాడ మాసపు పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయినులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకును గౌరీదేవి అనుగ్రహం, సౌభాగ్యానికి ప్రతీకగా గోరింటాకును భావిస్తారని తెలిపారు. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి, శరీరంలో వేడిని తగ్గించడానికి గోరింటాకు సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయతను వివరించారు. ప్రస్తుత కాలంలో రసాయన కోన్లకు దూరంగా ఉండి, ప్రకృతిసిద్ధమైన ఆచారాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు