గణేశ్ నిమజ్జనానికి ఆన్లైన్ ఇంటిమేషన్ తప్పనిసరి
తెలంగాణ పోలీస్ ఆన్లైన్ పోర్టల్ ప్రారంభం.. నిర్వాహకులు వివరాలు నమోదు చేసుకోవాలి
హైదరాబాద్ | Ntoday News
గణేశ్ నిమజ్జన ఊరేగింపులు, ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత, ప్రశాంత వాతావరణం కోసం తెలంగాణ పోలీస్ ఆన్లైన్ ఇంటిమేషన్ పోర్టల్ను ప్రారంభించినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ తెలిపింది.
వినాయక విగ్రహాల ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఇందుకోసం [తెలంగాణ పోలీస్ ఆన్లైన్ పోర్టల్](https://policeportal.tspolice.gov.in)ద్వారా అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలని తెలిపారు.
ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం ద్వారా గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సమయంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసు సేవలను సమన్వయంతో అందించేందుకు వీలుంటుందని అధికారులు పేర్కొన్నారు.
గణేశ్ మండపాల నిర్వాహకులు సమయానికి వివరాలు నమోదు చేసి పోలీసు శాఖకు సహకరించాలని మల్కాజిగిరి పోలీసులు కోరారు.