గణేశ్ ఉత్సవాలు.. వారికి సెలవులు రద్దు
గణేశ్ ఉత్సవాల వేళ TGSPDCL సిబ్బంది సెలవులు రద్దు
సెప్టెంబర్ 14–25 వరకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఎండీ జితేశ్ వి. పాటిల్ ఆదేశం
హైదరాబాద్ | Ntoday News
హైదరాబాద్లో సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు జరగనున్న గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా కోసం TGSPDCL సిబ్బందికి సాధారణ సెలవులను రద్దు చేసినట్లు సంస్థ ఎండీ జితేశ్ వి. పాటిల్ తెలిపారు.
గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సమయంలో నగరవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు, సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
ప్రధాన నిమజ్జన కేంద్రాలు, గణేశ్ విగ్రహాల ఊరేగింపు మార్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నిమజ్జన ఊరేగింపులు సజావుగా సాగేలా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర విద్యుత్ వ్యవస్థలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
గణేశ్ ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎండీ జితేశ్ వి. పాటిల్ ఆదేశించారు.