BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 Jun, 2026 - 10:23 PM
84 వీక్షణలు

22 మంది అభ్యర్థులు అర్హత సాధింపు

శ్రీశైలం, జూన్ 9: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీరశైవ ఆగమ పాఠశాలలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. చంద్రవతి కల్యాణ మండపంలో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 25 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 22 మంది హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు.

ప్రవేశ పరీక్షకు హాజరైన 22 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కోర్సులో ప్రవేశానికి అర్హత పొందిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలించారు.

వీరశైవ ఆగమ కోర్సు కాలపరిమితి ఆరు సంవత్సరాలు కాగా, విద్యాభ్యాస సమయంలో విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించబడతాయని అధికారులు వెల్లడించారు.

ఈ పరీక్ష నిర్వహణలో ఎం. శివశంకరయ్య స్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, పాఠశాల పర్యవేక్షకులు డి. రంగన్న, వార్డెన్ జి. శ్రీనివాసులు, ఆగమ పండితులు ఎం. శివయ్య, ఆంగ్ల ఉపాధ్యాయులు డి. లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శైవ ఆగమ సంప్రదాయ పరిరక్షణ, అర్చక విద్యాభివృద్ధి లక్ష్యంగా ఈ కోర్సును శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తోంది.