BREAKING
శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు
www.ntodaynews.com

శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 Jun, 2026 - 10:23 PM
9 వీక్షణలు

22 మంది అభ్యర్థులు అర్హత సాధింపు

శ్రీశైలం, జూన్ 9: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీరశైవ ఆగమ పాఠశాలలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. చంద్రవతి కల్యాణ మండపంలో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 25 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 22 మంది హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు.

ప్రవేశ పరీక్షకు హాజరైన 22 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కోర్సులో ప్రవేశానికి అర్హత పొందిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలించారు.

వీరశైవ ఆగమ కోర్సు కాలపరిమితి ఆరు సంవత్సరాలు కాగా, విద్యాభ్యాస సమయంలో విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించబడతాయని అధికారులు వెల్లడించారు.

ఈ పరీక్ష నిర్వహణలో ఎం. శివశంకరయ్య స్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, పాఠశాల పర్యవేక్షకులు డి. రంగన్న, వార్డెన్ జి. శ్రీనివాసులు, ఆగమ పండితులు ఎం. శివయ్య, ఆంగ్ల ఉపాధ్యాయులు డి. లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శైవ ఆగమ సంప్రదాయ పరిరక్షణ, అర్చక విద్యాభివృద్ధి లక్ష్యంగా ఈ కోర్సును శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తోంది.