BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 Jun, 2026 - 10:22 PM
82 వీక్షణలు

230 మందికి పైగా యోగసాధకుల పాల్గొనీ 

శ్రీశైలం, జూన్ 9: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న యోగా శిక్షణా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నట్లు వెల్లడించారు.

మంగళవారం చంద్రవతి కల్యాణ మండపంలో నిర్వహించిన యోగా శిక్షణా కార్యక్రమంలో 230 మందికి పైగా యోగసాధకులు పాల్గొని శిక్షణ పొందారు. దేవస్థానం సిబ్బంది, స్థానికులు, శివసేవకులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ, స్థానికులు మరియు యాత్రికులు యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొని యోగా పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. యోగసాధన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అందువల్లే యోగా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిందని పేర్కొన్నారు.

యోగాచార్యుడు గంధవళ్ళ బాలసుబ్రహ్మణ్యం మరియు వారి బృందంలోని యోగా గురువులు సాధకులకు వివిధ యోగా విధానాలపై శిక్షణ అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో ప్రాణాయామం చేయించడంతో పాటు పలు సూక్ష్మ వ్యాయామాలు నిర్వహించారు. అనంతరం వివిధ యోగాసనాలను అభ్యసింపజేశారు.

యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంతో పాటు యోగా సాధనను మరింత విస్తృతంగా ప్రోత్సహించేందుకు శ్రీశైల దేవస్థానం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.