www.ntodaynews.com
హాజీపూర్ నార్కోటిక్ డాగ్ సింబా సహాయంతో గంజాయి పట్టివేత.. ఏడుగురి అరెస్ట్
తెలంగాణ
/
మంచిర్యాల
/
హాజీపూర్
హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు బుధవారం హైవే పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్కోటిక్ డాగ్ "సింబా" సహాయంతో వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి 19 గంజాయి ప్యాకెట్లను (మొత్తం బరువు 74 గ్రాములు), అలాగే 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఏడుగురిపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు