www.ntodaynews.com
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు రాజు ముదిరాజ్ నియామకం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు రాజు ముదిరాజ్ నియామకం
మంచిర్యాల, ఏప్రిల్ 26: మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు గుండు రాజు ముదిరాజ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గుండు రాజు ముదిరాజ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించినందుకు జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతానని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ నియామకం పట్ల జిల్లాలోని బీసీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు