www.ntodaynews.com
తునికిపాడులో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం–1లో శుక్రవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ వి. సులోచన మాట్లాడుతూ, శిశువు పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించడం ఎంతో అవసరమని తెలిపారు. పుట్టిన తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు.
మహిళా పోలీస్ జి. అపర్ణ మాట్లాడుతూ తల్లిపాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉండటంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. గర్భిణులు, బాలింతలు సీజన్లో చౌకగా లభించే ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.