www.ntodaynews.com
మరొకసారి మానవత్వం చాటుకున్న గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు
తెలంగాణ
మరొకసారి మానవత్వం చాటుకున్న గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు
నియోజకవర్గ ప్రజలను ఆపదలో ఆదుకునే వ్యక్తిగా మరొకసారి నిలిచారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఓ చిన్నారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షలు ఆర్థిక సహాయం అందించి, ఆ కుటుంబానికి అండగా ఉంటానని MLA మద్దిపాటి వెంకటరాజు ధైర్యం చెప్పారు. గోపాలపురం నియోజకవర్గo , ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సాయం పాలెం గ్రామానికి చెందిన హరిబాబు రాజేశ్వరి అనే భార్యాభర్తలు ఆరేళ్ల పాప, నాలుగేళ్ల బాబు సంతానం. ఇటీవల ఇద్దరు పిల్లలు అనారోగ్యం పాలై పాప వారం రోజుల క్రితం చనిపోయింది. అయితే బాబుని అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాదు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యానికి సుమారు 20 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. బాబు పరిస్థితి తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చలించిపోయారు. వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పది లక్షలకు ఎల్ఓసి ఇప్పించి హైదరాబాద్ ఆస్పత్రిలోని డాక్టర్లతో మాట్లాడి వెంటనే వైద్య సేవలు అందేటట్లు చేసి ఆ బాబుకు అండగా తానున్నానంటూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య ఎదురైనా సరే ఆయన ముందు ఉంటారని మరోసారి రుజువు చేశారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన చేస్తున్న సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube