BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Apr, 2026 - 01:26 PM
41 వీక్షణలు

చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు

ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు ప్రశంసించారు. స్వర్ణాంధ్ర స్వాప్నికుడు, నిత్య కృషీలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ లోని తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించగా, మోరంపూడి శ్రీనివాస రావు, బొంతు సతీష్ లు అతిథులుగా పాల్గొన్నారు.

చనుబండ బీ సీ కాలనీలో జరిగిన ఈ వేడుకలు, కేక్ కటింగ్, మిఠాయిలు పంచడం, "జై బాబు, జైజై బాబు" అనే నినాదాలతో యువత హోరెత్తించడం, కేరింతలు కొట్టడం వంటి కార్యక్రమాలతో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాస రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, తెలుగు దేశం పార్టీని బలోపేతం చేయడం, మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని అధికారం లోకి తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇది మనం చంద్ర బాబుకు ఇచ్చే కానుక అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మిద్దె అఖిల్, భారత సురేష్, కంటే చెన్నా, నరసింహా, సిశాంత్, షేక్ రియాజ్, గత్తం సన్నీ, మిద్దె నాగేశ్వర రావు, చిల్లపల్లి చెన్నారావు, షేక్ బాబా, అరవింద్ తదితర తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.