www.ntodaynews.com
ఆరుగోలనుపేట ఎంపీయూపీఎస్లో ఘనంగా మెగా పీటీఎం–4.0
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం ఆరుగోలనుపేట ఎంపీయూపీఎస్లో శుక్రవారం మెగా పీటీఎం–4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎం. చంద్రు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, పి. సత్యనారాయణరెడ్డి హాజరై విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల చదువు, క్రమశిక్షణ, హాజరు, ప్రతిభపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించి పలు సూచనలు అందించారు.
పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిస్తూ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.