కీసర సత్యనారాయణ రెడ్డి చిత్రపటానికి నివాళులు
తెలంగాణ
/
ఖమ్మం
కీసర సత్యనారాయణ రెడ్డి చిత్రపటానికి డాక్టర్ మట్టా దయానందు నివాళులు
సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన కీసర సత్యనారాయణ రెడ్డి ఇటీవల మృతి చెందారు. సోమవారం అయన స్వగ్రామం లో వారి నివాసంలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానందు విజయకుమార్ పూలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులును పరామర్శిచి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు
ఈ కార్యక్రమం లో కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, పేరువంచ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.