www.ntodaynews.com
రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్మాణాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి, ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు రైల్వే ఉన్నతాధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.