వేముల వీరేశంకు మంత్రి హోదా దక్కడం ప్రజాసేవకు లభించిన గుర్తింపు : సంజయ్ దాస్ గౌడ్
వేముల వీరేశంకు మంత్రి హోదా దక్కడం ప్రజాసేవకు లభించిన గుర్తింపు : సంజయ్ దాస్ గౌడ్
రాష్ట్ర మంత్రి హోదా పొందిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను శుక్రవారం తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఆయనను కలసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వేముల వీరేశంకు రాష్ట్ర మంత్రి హోదా లభించడం ఆయన ప్రజాసేవకు, రాజకీయ అనుభవానికి దక్కిన తగిన గుర్తింపని కొనియాడారు. ఉద్యమకారుల ఆశయాలకు అనుగుణంగా ఆయన ప్రజాసేవలో మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వీరేశం నాయకత్వంలో నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులు జోగు లింగస్వామి, కొసనం అశోక్, బత్తుల నాగరాజు గౌడ్, జోగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..