BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్

తెలంగాణ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
20 Apr, 2026 - 08:50 PM
145 వీక్షణలు

65 ​జాతీయ రహదారిపై 'డీజిల్ నో స్టాక్  NTODAY NEWS 

ఉమ్మడి నల్గొండ జిల్లా గుండా వెళ్లే విజయవాడ-హైదరాబాద్ 65వ నంబర్ జాతీయ రహదారిపై ఇంధన కష్టాలు మొదలయ్యాయి. గత మూడు  రోజులుగా  పెట్రోల్ బంకుల్లో "డీజిల్ లేదు" అనే మాటలు వినిపిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ కీలక రహదారిపై డీజిల్ దొరక్కపోవడం రవాణా రంగాన్ని కుదిపేస్తోంది. సాధారణ ప్రయాణికులే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తీసుకెళ్లే అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర సేవలందించే వాహనాలకు కూడా డీజిల్ లభించని పరిస్థితి నెలకొంది. బంకుల వద్దకు వెళ్తే.. స్టాక్ లేదని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో గమ్యస్థానాలకు చిరాశిన వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయి.

* ​బంక్ నిర్వాహకుల కథనం ప్రకారం..

గత కొద్ది రోజులుగా చమురు కంపెనీల నుండి సక్రమంగా లోడ్లు రావడం లేదని,
​బుకింగ్స్ క్యాన్సిలేషన్: డీజిల్ కోసం నగదు చెల్లించి బుక్ చేసుకున్నా, సరఫరా కేంద్రాల వద్ద లోడ్లు క్యాన్సిల్ అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

* డీజిల్ కి ​పెరిగిన డిమాండ్:

మార్చి-ఏప్రిల్ నెలల్లో సాధారణంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, దానికి తగ్గట్టుగా సరఫరా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.
​ఆర్ధిక భారం: అడ్వాన్స్ పేమెంట్లు చేసినా స్టాక్ రాకపోవడంతో బంకుల నిర్వహణ భారంగా మారిందని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో 'నో స్టాక్' బోర్డులు పెడుతున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి.

* ​ప్రభుత్వం స్పందించాలి

​ప్రభుత్వ యంత్రాంగం మరియు పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, చమురు కంపెనీలతో చర్చించి తక్షణమే డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.