BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై పెద్దపులి కలకలం.. వాహనదారుల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 07:46 AM
55 వీక్షణలు

శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై పెద్దపులి కలకలం.. వాహనదారుల్లో ఆందోళన

శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి కనిపించడం కలకలం రేపింది. మున్ననూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు రహదారిపై పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన పులిని చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

కొంతసేపు పులి రహదారిపైనే నడుస్తూ కనిపించడంతో వాహనదారులు తమ వాహనాలను నిలిపివేసి సురక్షిత దూరంలో వేచి చూశారు. అనంతరం పులి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనను కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. రహదారిపై అడవి జంతువులు సంచరించే అవకాశం ఉన్నందున శ్రీశైలం అటవీ మార్గంలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో అనవసరంగా వాహనాలను ఆపకుండా, అడవి జంతువులకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.