పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
మేడికొండూరు: పేరేచర్ల జంక్షన్లో మేడికొండూరు పోలీసులు గురువారం సాయంత్రం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ట్రిపుల్ రైడింగ్, అతివేగం, సైలెన్సర్ లేకుండా వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ మధుసూదన్ రావు సూచించారు. వాహనదారులు హెల్మెట్ ధరించడం, వేగ నియంత్రణ పాటించడం, వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.