ఢిల్లీలో భారీ వర్షం.. ఎయిర్పోర్టులో వాటర్లాగింగ్
జాతీయం
/
హన్మకొండ
/
హన్మకొండ
భారీగా నిలిచిన వర్షపు నీరు.. ప్రయాణికులకు ఇబ్బందులు
న్యూఢిల్లీ | Ntoday News
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది.
ముఖ్యంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాటర్లాగింగ్ పరిస్థితి ఏర్పడింది. దీంతో విమానాశ్రయ పరిసరాల్లో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.
వర్షపు నీటిని తొలగించేందుకు సంబంధిత సిబ్బంది చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.