చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పలు అంశాలపై మాజీ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్తో చర్చ
పుంగనూరు | Ntoday News
పుంగనూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) నివాసానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెళ్లారు.
ఈ సందర్భంగా చల్లా బాబు రెడ్డితో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ, అభివృద్ధి అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
మంత్రి తన నివాసానికి రావడంతో చల్లా బాబు రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.