BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 08:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు: అప్పారావు కాలనీ ఆర్చి పేరుపై వైసీపీ ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 08:41 PM
5 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు.

ఎమ్మార్ అప్పారావు కాలనీ ప్రవేశ ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన పేరులో కొలుసు పార్థసారథి సౌజన్యంతో అన్న పదాలను తొలగించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. కాలనీ పేరుకు సంబంధించిన అంశంలో రాజకీయ జోక్యాన్ని అంగీకరించబోమని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. కాలనీ ఆర్చి పేరులో మార్పులు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆర్చి వద్ద ఉన్న వివాదాస్పద పేరును తొలగించాలని డిమాండ్ చేశారు.

ఆందోళన నేపథ్యంలో ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.