రేపటి నుంచి 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ
/
హైదరాబాద్
రేపటి నుంచి 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
ఎన్ టుడే న్యూస్ HYDERABAD: ధూల్పేట్ నుంచి గణేశ్ విగ్రహాల కొనుగోలు, రవాణా నేపథ్యంలో సెప్టెంబర్ 5 నుంచి 14 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. బోయిగూడ కమాన్-గాంధీ విగ్రహం మార్గంలో సాధారణ వాహనాలకు రాకపోకలు నిలిపివేస్తారు. పూరానాపూల్, గాంధీ విగ్రహం నుంచి వచ్చే సాధారణ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. గణేశ్ విగ్రహాల తరలింపు లారీలు, డీసీఎంలను జుమ్మేరాతబజార్లో నిలపాలని సూచించారు.