సత్తుపల్లి మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణి
సత్తుపల్లి మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణి, పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క
సత్తుపల్లి పట్టణం సిద్దారం రోడ్ ఎం ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హల్ నందు ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు ముఖ్య అతిధిగా పాల్గొని వేలాదిగా హాజరైన సత్తుపల్లి నియోజకవర్గం మహిళలకు చేరాలను పంపిణి చేశారు,
మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తినా సందర్భంగా ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేద ప్రజలుకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలు గురించి తెలియజేసారు. అన్ని పధకలలో మహిళలకు, రైతులకు, విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వెల్పేర్ సహకారంతో 100మంది మహిళా లబ్ధిదారులుకు కుట్టు మిసన్ లను, మంత్రి సీతక్క గారు, ఎమ్మెల్యే రాగమయి గారు, డా. మట్టా దయానంద్ విజయకుమార్ గార్లు కలిసి మహిళలకు పంపిణి చేసారు.
సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధికీ సహకరిస్తున్న రాష్ట్ర మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సీతక్క గారికి సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలు తరపున ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రస్ నాయకులు డా. మట్టా దయానంద్ విజయకుమార్ గారు కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ గారు, సత్తుపల్లి, కల్లూరు మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, నియోజకవర్గం లోని ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున డ్వాక్రా గ్రూప్ మహిళలు పాల్గొన్నారు