వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
తెలంగాణ
/
నల్గొండ
/
శాలిగౌరారం
శాలిగౌరారం మండలం: మండల పరిధిలోని ఊటూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి అనిత–శంకర్ దంపతుల కుమారుడు శివాజీ, నాగసింధు వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ వివాహ కార్యక్రమానికి మునుగోడ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులను కలిసి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.