సూరంపాలెంలో కృష్ణాష్టమి వేడుకల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించిన మోరంపూడి....
సూరంపాలెంలో కృష్ణాష్టమి వేడుకల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించిన మోరంపూడి.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ బీసీ బజారులో, చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలోని యాదవ బజారులో శుక్రవారం రాత్రి కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలను నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, చిన్నారులు హాజరై వేడుకలను ఆనందోత్సాహాలతో తిలకించారు. కార్యక్రమంలో శ్రీను, పిల్ల చెన్నా, మిద్దె చెన్నారావు, చిల్లపల్లి చెన్నారావు, దేసిన చెన్నారావు, తొర్లపాటి చెన్నారావు, చక్కటి చెన్నారావు, నిలపాల పండు, జమలయ్య తదితరులు పాల్గొన్నారు.
కృష్ణాష్టమి సందర్భంగా గ్రామాల్లో నిర్వహించిన ఉట్టి కొట్టే వేడుకలు పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి. చిన్నారులు, మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొనడంతో బజార్లు సందడిగా మారాయి.