పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు
నరసరావుపేట: లింగంగుంట్లలోని శ్రీ కేర్ ఆసుపత్రి వెనుక ఖాళీ ప్రదేశంలో 2–3 రోజుల క్రితం పుట్టిన ఆడ శిశువు గుర్తించబడింది. సెప్టెంబర్ 1 రాత్రి సుమారు 10.30 గంటలకు ఆసుపత్రి మేనేజర్ తియ్యగూర కృష్ణచైతన్యరెడ్డి ఆసుపత్రి పై అంతస్తులో ఫోన్లో మాట్లాడుతుండగా శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా డైపర్ మాత్రమే ధరించి ఉన్న ఆడ శిశువు కనిపించింది.
వెంటనే శిశువును ఆసుపత్రిలోకి తీసుకువచ్చి వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు శిశువును పరీక్షించి అవసరమైన వైద్య చికిత్స అందించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో శిశువుకు అవసరమైన వైద్య సంరక్షణ కొనసాగుతోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువుకు సంబంధించిన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల గురించి సమాచారం తెలిసిన వారు +91 94407 96244 నంబర్కు సంప్రదించాలని పోలీసులు కోరారు. డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ కిషోర్, సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.