మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
మెడికొండూరు: పెరిచర్ల జంక్షన్ వద్ద గుంటూరు వైపు వెళ్లే ఫ్లైఓవర్ వంతెనపై రోడ్డు దుస్థితి నెలకొంది. వంతెనపై ఏర్పడిన గుంతల్లో ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి, బయటకు వచ్చిన ఇనుప చువ్వలను తొలగించి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.