తిరుమల: టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం అరెస్ట్
కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ సమాచారంతో ఏసీబీ సోదాలు
తిరుమల: టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తులో సీబీఐ అందించిన సమాచారంతో ఏసీబీ అధికారులు తిరుపతి, తిరుమల, చెల్లూరు ప్రాంతాల్లో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు.
సోదాల్లో లోకనాథం కుటుంబ సభ్యుల పేర్లతో ఇళ్లు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆయన నివాసాల్లో నిర్వహించిన తనిఖీల్లో 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తులో సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అక్రమాస్తుల వ్యవహారంలో లోకనాథంను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.