BREAKING
మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది
Date of Publish : 03 September 2026, 11:57 am
Posted by : SEETHA KIRAN KUMAR

హైకోర్టు ఆదేశాలపై చర్యలు తీసుకోలేదని పిటిషనర్ ఆరోపణ

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
03 Sep, 2026 - 11:57 AM
7 వీక్షణలు

తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు కోర్టు ధిక్కరణ నోటీసులు

హైదరాబాద్ | Ntoday News

తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ నిధుల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ దుర్గం రవీందర్ గతంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సంబంధిత అంశాలపై విచారణ జరిపి మూడు నెలల్లో తగిన చర్యలు తీసుకోవాలని గతేడాది అక్టోబర్‌లో విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు.

అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసి ఏడాది గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దుర్గం రవీందర్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం, కోర్టు ఆదేశాల అమలుపై వివరణ ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో అధికారులు తమ వైఖరిని, కోర్టు ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరించాల్సి ఉంటుంది.

గమనిక: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీకి సంబంధించిన అక్రమాల ఆరోపణలు పిటిషన్‌లో చేసిన ఆరోపణలు మాత్రమే; అవి న్యాయస్థానం తుది నిర్ణయంగా భావించరాదు.