ఢిల్లీ పర్యటన వివరాలు అనుచరులకు వెల్లడించనున్న మంత్రి కొండా సురేఖ
ఢిల్లీ పర్యటన వివరాలను అనుచరులకు వెల్లడించనున్న కొండా సురేఖ
నేడు వరంగల్ నియోజకవర్గ అనుచరులతో మంత్రి భేటీ
వరంగల్ | Ntoday News
మంత్రి కొండా సురేఖ నేడు వరంగల్ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో సమావేశం కానున్నారు. ఇటీవల ఆమె చేపట్టిన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సమావేశంలో అనుచరులకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, అనుచరులతో సురేఖ భేటీ కానున్న నేపథ్యంలో రాజకీయంగా ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చలు, అక్కడ ప్రస్తావించిన అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం “అధిష్ఠానానికి అన్ని విషయాలు చెప్పాను” అని కొండా సురేఖ పేర్కొన్న నేపథ్యంలో, నేటి సమావేశంలో ఆమె ఏ అంశాలపై స్పష్టత ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.