భద్రకాళి చెరువు రూపురేఖల్లో భారీ మార్పులు
రూ.64.26 కోట్లతో అభివృద్ధి.. కేబుల్ కార్ రోప్వే, గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రధాన ఆకర్షణలు
వరంగల్ | Ntoday News
ఓరుగల్లు పర్యాటకానికి మరింత ఊపునిచ్చేలా భద్రకాళి చెరువు రూపురేఖలు మారనున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా రూ.64.26 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులో పలు కీలక వసతులను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో కేబుల్ కార్ రోప్వే, గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. కాకతీయుల చారిత్రక నేపథ్యానికి అనుగుణంగా పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పించేలా ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు.
KUDA ఆధ్వర్యంలో 30 ఏళ్ల DBFOT ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో నవగ్రహ ఐలాండ్స్, BDVT పార్క్, వాకింగ్ ట్రాక్లు, బోటింగ్ సౌకర్యం, ఫుడ్ స్టాల్స్తో పాటు కాకతీయ మ్యూజికల్ గార్డెన్ వంటి ప్రత్యేక ఆకర్షణలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ అభివృద్ధి పనులు పూర్తయితే భద్రకాళి చెరువు వరంగల్ నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత ఆకర్షణీయంగా మారడంతో పాటు, ఓరుగల్లు పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది.