అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
కుక్కునూరులో పూజలు, అర్చనలు.. కేక్ కట్ చేసి పాలాభిషేకం
కుక్కునూరు | Ntoday News
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను కుక్కునూరు మండలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పేరిట ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం కుక్కునూరు మండల కేంద్రంలోని మెయిన్ సెంటర్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పవన్ కల్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో కుక్కునూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ములిశెట్టి యుగంధర్తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగు, బీజేపీ నాయకుడు లక్ష్మణ చార్యులు, ఉపాధ్యక్షులు వెంకన్న బాబు, గంధం నాగరాజు, తోట వినోద్, అవుల శ్రీను, ధనస్వామి, సీతారామయ్య, నూక వినోద్, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.