BREAKING
అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష
Date of Publish : 02 September 2026, 01:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 01:16 PM
8 వీక్షణలు

భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిల పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు న్యూపాలెస్ సెంటర్‌లో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జనసేన పార్టీ కట్టుబడి ఉందనే సందేశాన్ని చాటుతూ భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే పవన్ కళ్యాణ్ లక్ష్యమని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కూడా పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగినేని సుధాకర్ (న్యాయవాది), పసుపులేటి రవీంద్ర, రామిశెట్టి జగన్, నామా నాగరాజు, నల్లగర్ల బద్రీ, బచ్చే మేస్త్రి తదితరులతో పాటు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.