ఢిల్లీ నిరసనపై CJP యూటర్న్
జాతీయం
New Delhi: ఢిల్లీలో ఈనెల 5న తలపెట్టిన నిరసన ర్యాలీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) సుప్రీంకోర్టుకు తెలిపింది. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఎఆర్అను రద్దు చేయడంతో పాటు విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేయడంతో సీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ర్యాలీని విరమించుకుంటున్నట్లు వెల్లడించింది.