గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ......
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్
గుంటూరు శ్రీనగర్కు చెందిన హోటల్ వ్యాపారి సైబర్ క్రైమ్ బారిన పడ్డారు. ఫోన్ సందేశం రాకుండానే అతని ఖాతా నుంచి రూ.4,46,000 డబ్బులు ఖాళీ అయ్యాయి.
తన క్రెడిట్ కార్డు నుంచి ఈ నెల 17న గుర్తు తెలియని వ్యక్తులు నగదు బదిలీ చేసుకున్నారని బాధితుడు తెలిపారు. దీంతో గుంటూరు బుద్ధవారి ఆరండల్పేట పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.