చింతలపూడిలో ఘనంగా ఏఎంసీ చైర్మన్ చిదరాల దుర్గాపార్వతి మధుబాబు జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్
చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిదరాల దుర్గాపార్వతి మధుబాబు జన్మదిన సందర్భంగా టీడీపీ నాయకులు కె. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా మధుబాబును శాలువాతో సత్కరించి, స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మధుబాబు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.