వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ
మునగపాకలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బొడ్డేడ ప్రసాద్
మునగపాక | Ntoday News
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాకలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మునగపాక గ్రామంలోని నందీశ్వర ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయనను తెలుగు ప్రజలు నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు.
వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన తర్వాత అదే స్థాయిలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బొడ్డేడ ప్రసాద్ కొనియాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ కుటుంబం పనిచేస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆడారి అచ్చినాయుడు, ఎంపీపీ ముల్లెట్ కృష్ణవేణి నారాయణరావు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.