ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
తెలంగాణ
/
హన్మకొండ
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు.
రేషన్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలు సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో శనిగరపు వెంకటేష్, నాయకులు బోనగిరి నాగరాజు, కడారి రాజు, శ్యామసుందర్ రెడ్డి, జంపాల ప్రవీణ్, రేషన్ డీలర్లు నాంపల్లి కవిత, సమ్మయ్య, కార్యదర్శి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.