నకిరేకల్లో సీఎం సభను విజయవంతం చేయాలి
ఉరుమడ్లలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
నల్గొండ జిల్లా | చిట్యాల మండలం | ఉరుమడ్ల | సెప్టెంబర్ 1, 2026
ఈ నెల 5న నకిరేకల్లో జరగనున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఉరుమడ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో సభ ఏర్పాట్లు, కార్యకర్తల భాగస్వామ్యం, ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించే అంశాలపై చర్చించారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయాలని నాయకులు నిర్ణయించారు.
నకిరేకల్ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా గ్రామస్థాయిలో విస్తృతంగా కృషి చేయాలని సమావేశంలో నాయకులు సూచించారు.
నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం కృషి చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఉరుమడ్ల గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామస్థాయిలో ప్రజలకు సభ వివరాలను తెలియజేసి, వారిని భాగస్వాములను చేయాలని నాయకులు తెలిపారు.
ఈ సమావేశంలో సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, ఉద్యమకారుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు సైదులు, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్ గౌడ్, వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, మేడబోయిన స్వాతి శ్రీను, పాకాల దినేష్, ఎలిమినేటి హరిప్రసాద్ రెడ్డి, గంగాపురం రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంగు శంకర్, చెరుకు యాదమ్మ, ఉయ్యాల మల్లేష్ గౌడ్, జన్నపాల రాము, అనంతుల శంకరయ్య, జన్నపాల జానయ్య, సాగర్ల వెంకన్న, కొండ మహేష్ గౌడ్, పెండల ప్రభుకుమార్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.