BREAKING
పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం
Date of Publish : 01 September 2026, 08:18 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
01 Sep, 2026 - 08:18 PM
8 వీక్షణలు

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత

మంచిర్యాల | N Today News

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అండగా నిలిచారు.

దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన బి. శ్రీ చందన అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద రూ.2,50,000 విలువైన ఎల్‌ఓసీ (Letter of Credit) మంజూరు చేయించారు.

ఈ మేరకు మంజూరైన ఎల్‌ఓసీని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు శ్రీ చందన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితుల కారణంగా పేద కుటుంబాలు మెరుగైన వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులకు అండగా నిలుస్తోందన్నారు.

కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీ చందన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, సర్పంచ్ చుంచు నగేష్, ఉప సర్పంచ్ ముత్తే శంకరయ్య, వార్డు సభ్యుడు మహేష్, నాయకులు ఆకుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.