కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్ర పురానికి సంబంధించిన పిఆర్టియు తెలంగాణ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు, గూడెపుకుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లాడి సత్యనారాయణ గౌడ్ గారికి సారస్వత పరిషత్ కింగ్ కోటి హైదరాబాద్ వేదికగా ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ మరియు స్ఫూర్తి అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ విభాగంలో వారు గత 24 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను గుర్తించి హానరరీ డాక్టరేట్ పట్టాను అందజేశరు. తమ గ్రామ వాసికి డాక్టరేట్ పట్టాను ప్రధానం చేసినందుకు గ్రామ సర్పంచ్ శ్రీ చక్రాల ఉమాపిచ్చయ్య, ఉపసర్పంచ్ దోసపాటి రవి మరియు వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు ,ప్రజలు అభినందనలు తెలియజేశారు.