పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు
పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రిలోని శ్రీ నీలాద్రిశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పరాభవ నామ సంవత్సరం శ్రావణమాసం తదియ సందర్భంగా ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి అభిషేక కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
ఈ సందర్భంగా సత్తుపల్లి వాసి రామ్ సాయి స్వామివారి ప్రసాదాల తయారీ కోసం 25 కిలోల బియ్యం విరాళంగా అందించారు. తిరువూరు వాసి మల్లెల శ్రీనివాస్ స్వామివారి దీపారాధన కోసం 5 కిలోల నువ్వుల నూనెను సమర్పించారు.
ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలకు భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.