BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 01 September 2026, 04:57 pm
Posted by : DAVU RAVINDER REDDY

వినాయక విగ్రహాల ధరలకు రెక్కలు.. 20 అడుగుల మూర్తి రూ.లక్షకు పైగానే

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
01 Sep, 2026 - 04:57 PM
13 వీక్షణలు

హైదరాబాద్: వినాయక చవితి సమీపిస్తుండటంతో నగరంలో వినాయక విగ్రహాల తయారీ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ధూల్‌పేట్‌తో పాటు హైదరాబాద్ శివార్లలోని వివిధ ప్రాంతాల్లో విగ్రహాల తయారీదారులు 5 అడుగుల నుంచి 30 అడుగుల వరకు భారీ మట్టి, ఇతర పదార్థాలతో తయారు చేసిన వినాయక మూర్తులను సిద్ధం చేస్తున్నారు.

పండుగకు సమయం దగ్గరపడటంతో విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వివిధ ఆకృతులు, అలంకరణలు, రంగులతో ప్రత్యేకంగా రూపొందించిన విగ్రహాలు భక్తులను ఆకట్టుకునేలా తయారు చేస్తున్నారు.

అయితే ముడిసరుకుల ధరలు, విగ్రహాల తయారీకి అవసరమైన సామగ్రి, కార్మికుల కూలీలు, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ ఏడాది విగ్రహాల ధరలు కూడా పెరిగినట్లు తయారీదారులు చెబుతున్నారు.

ప్రస్తుతం 20 అడుగుల వినాయక విగ్రహం ధర రూ.లక్షకు పైగానే పలుకుతోంది. విగ్రహం ఎత్తు, రూపురేఖలు, ఉపయోగించే ముడిసరుకులు, రంగులు, అలంకరణలు, ప్రత్యేక డిజైన్లను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.

పెద్ద విగ్రహాలకు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, వివిధ ప్రాంతాల నుంచి వినియోగదారులు వచ్చి తమకు కావాల్సిన ఆకృతులు, పరిమాణాల్లో విగ్రహాలను ముందుగానే బుక్ చేసుకుంటున్నారని తయారీదారులు పేర్కొన్నారు.