BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 01 September 2026, 05:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంభంపాడు ప్రధాన రహదారిపై ఆక్రమణల పరిశీలన....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 05:13 PM
21 వీక్షణలు

కంభంపాడు ప్రధాన రహదారిపై ఆక్రమణల పరిశీలన.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత

కంభంపాడు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం కంభంపాడు గ్రామంలోని ప్రధాన రహదారిపై నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, ఫుట్‌పాత్ ఆక్రమణలను తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ మంగళవారం పరిశీలించారు.

గ్రామంలోని బస్ షెల్టర్, బస్సులు ఆగే ప్రాంతం, నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న అంశాలను ఆయన పరిశీలించారు. ఫుట్‌పాత్‌లపై వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలను వెంటనే తొలగించి పాదచారులకు మార్గం అందుబాటులో ఉండేలా చూడాలని ఏ కొండూరు పోలీసు సిబ్బంది, తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బస్ షెల్టర్, బస్సులు నిలిచే ప్రాంతం, నాలుగు రోడ్ల కూడలి వద్ద ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులు, పాదచారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అనంతరం రహదారి పక్కన ఉన్న వాహనదారులు, దుకాణాల యజమానులతో మాట్లాడి ఆక్రమణల తొలగింపునకు సహకరించాలని కోరారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారులను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచాలని సూచించారు.